Couple suicide attempt: నవ జంట ఆత్మహత్యాయత్నం... వధువు మృతి

author img

By

Published : Sep 15, 2022, 12:50 PM IST

suicide attempt

Newly married couple suicide attempt: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో నవ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా భర్త గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

పల్నాడు జిల్ల పిడుగురాళ్ల పట్టణ పరిధి రజక కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నవ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. గత 15 రోజుల క్రితం వినాయక చవితి పండగ రోజున ఇరు కుటుంబాల అంగీకారంతో ఆలయంలో వరుడు తాడువాయి వినయ్(19), చంపాలా అఖిల (17) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ కలహాల మధ్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో వధువు మృతి చెందగా.. వరుడు వినయ్ పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వధువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.