ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..

author img

By

Published : Nov 24, 2022, 4:13 PM IST

Updated : Nov 24, 2022, 4:40 PM IST

Woman Gave Birth to Three Babies In NTR District

Woman Gave Birth to Three Babies In NTR District : ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది. ఒకేసారి ముగ్గురు పిల్లలు తమ కుటుంబంలోకి రావటంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

Woman Gave Birth to Three Babies : ఒకే కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామకు చెందిన షేక్ అమీనా ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ నొప్పులతో వచ్చిన అమీనాకి ఉచితంగా సర్జరీ చేశామని పద్మశ్రీ హాస్పిటల్​ వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించటంతో.. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు ఆ తల్లి, పిల్లలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు పిల్లలను స్థానిక పూజిత పిల్లల వైద్యశాలలోని ఇంక్యూబెటర్​లో ఉంచామని వైద్యులు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఇవీ చదవండి:

Last Updated :Nov 24, 2022, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.