srisailam dam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

author img

By

Published : Sep 16, 2021, 3:46 AM IST

Updated : Sep 16, 2021, 4:24 AM IST

On going flood to Srisailam reservoir

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,10,767 క్యూసెక్కులగా కొనసాగుతుంది.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,10,767 క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో అధికారులు..ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 55 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 59,589 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయం ప్రస్తుతం నీటిమట్టం 883 అడుగులు కాగా.. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 208.28 టీఎంసీలు కాగా.. గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండి..

Cabinet meet: నేడు ముఖ్యమంత్రి జగన్​ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ

Last Updated :Sep 16, 2021, 4:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.