కర్నూలు జిల్లా మాధవరం గ్రామంలో ఉపేంద్ర అనే రైతు తన కోడె దూడతో బైక్ విన్యాసాలు చేయిస్తున్నారు. పొలంలో కోడె దూడ ఎగురుతుంటే చూసి మొదట తన ద్విచక్రవాహనం పైనుంచి దూకడం నేర్పించారు. ఒకటి కాదు.. ఇంకో 4 బైకులు వరుసగా పెడదామంటూ స్నేహితులు సూచించడంతో అదేవిధంగా చేశారు. ఏరువాక పౌర్ణమి రోజు ద్విచక్రవాహనాలను హైవే పక్కన వరుసగా నిలబెట్టి ప్రజలందరూ చూసేటప్పుడు కోడెదూడతో విన్యాసాలు చేయించారు. ఈ విన్యాసాలు చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: