ACCIDENT: ఆటో మినీ లారీ ఢీ.. నలుగురికి గాయాలు

author img

By

Published : Sep 18, 2021, 10:31 PM IST

ACCIDENT

కర్నూలు జిల్లాలో ఓ ఆటో, మినీ లారీ ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా అవుకు మండలం లింగం బోడు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బండి ఆత్మకూరు మండలం బి.కోడూరుకు చెందిన ఓ కుటుంబం సొంత ఆటోలో అవుకు మండలం ఓబులాపురం ప్రయాణిస్తుండగా.. మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఆటో నడుపుతున్న మధు కృష్ణ ఆయన భార్య లక్ష్మీపార్వతి, కుమారుడు నిర్మల్, కూతురు భార్గవిలకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని వెంటనే బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. రోడ్డు పక్కకు వెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

MURDER: రౌడీషీటర్‌ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.