Srisailam: యాత్రలో ఆగిన గుండె... విషాదంలో స్నేహితులు

author img

By

Published : Sep 19, 2021, 5:17 PM IST

heart attack

శ్రీశైలం యాత్రకు వచ్చిన ఒక భక్త బృందంలో తీరని విషాదం చోటు చేసుకుంది. శివ దర్శనం చేసుకున్నాక గుండెపోటుతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంట వచ్చిన స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

శ్రీశైలం యాత్రకు వచ్చిన ఒక భక్త బృందంలో తీరని విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లికి చెందిన వల్లిక అశోక్(25) స్నేహితులతో కలిసి శ్రీశైల మల్లికార్జుని దర్శనానికి వచ్చారు. దర్శనం ముగిసిన తరువాత పురవీధుల్లోకి చేరుకోగానే అశోక్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. స్నేహితులు అతడిని దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. వెంట వచ్చిన స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి : HRC: 'పోలీసుల దాష్టీకమే అబ్దుల్‌ సలాం ప్రాణం తీసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.