డిసెంబర్​లో విజయవాడ వేదికగా.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

author img

By

Published : Sep 23, 2022, 7:09 PM IST

mandali

Telugu Writers Congress-2022: ఈ ఏడాది డిసెంబర్ 23, 24 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి మరిన్ని వివరాలను 93912 38390 ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

Telugu Writers Congress-2022: తెలుగు రచయితల మహాసభలు-2022కు విజయవాడ వేదికైంది. ఈ ఏడాది డిసెంబర్ 23, 24 తేదీల్లో జరిగే ఈ మహసభలకు ప్రపంచంలోని తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు పాల్గొననున్నారని.. మహాసభల గౌరవ అధ్యక్షుడు మండలి బుద్దప్రసాద్ వెల్లడించారు. మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర-కర్తవ్యం లక్ష్యంగా ఈ మహాసభలు కొనసాగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. రచయితలు ఒకచోట సమావేశమై.. తీసుకునే నిర్ణయాలు, ప్రజలను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఈ సభలకు హాజరయ్యే సాహితీ అభిమానులు ఈ అక్టోబర్ 31లోగా రూ. 500 రుసుము చెల్లించి, పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మహాసభల నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలకైనా 93912 38390 నెంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.