పదో తరగతి పరీక్షలో ఫెయిల్.. మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య

author img

By

Published : Jun 8, 2022, 9:02 PM IST

students suicide due to fail in ssc results

SSC Students Suicide in Krishna District: తాజాగా వెలుబడిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్​ అయిన ఇద్దరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కృష్ణా జిల్లాలో మంగళవారం ఒకరు చనిపోగా.. శానిటైజర్​ తాగడంతో ఇవాళ మరొకరు బలవన్మరణం చెందారు.

SSC Students Suicide: కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పదో తరగతి ఫెయిల్​ కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మండలంలోని పద్దరాయుడుతోటకు చెందిన శివకుమార్.. ఉరివేసుకొని మంగళవారం మృతిచెందగా.. కాజా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన డొక్కుమాల హేమచందర్(16) మంగళవారం శానిటైజర్ తాగి చనిపోయాడు.

హేమచందర్​ తల్లి కొంత కాలం క్రితం మరణించగా.. తండ్రి ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ హైదరాబాద్​లో ఉంటున్నాడు. నాయనమ్మ దగ్గర ఉంటున్న హేమచందర్​.. కాజా జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదివాడు. శివకుమార్, హేమచందర్​.. ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. స్నేహితుని మరణ వార్త విని కుంగుబాటుకు గురైన హేమచందర్​.. నిన్న ఉదయం శానిటైజర్​ తాగాడు. గ్రామస్థులు వెంటనే అతన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. కాజా పరిషత్ జిల్లా హై స్కూల్​లో చదివే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. 'బాగా చదివాను.. ఎందుకు ఫెయిల్ అయ్యానో అర్థం కావడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశాడని హేమచందర్​ స్నేహితులు అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.