సందడిగా శ్రీమతి అమరావతి కార్యక్రమం.. హాజరైన సినీనటి కామ్నాజెఠ్మలానీ

author img

By

Published : Nov 21, 2022, 2:12 PM IST

విజయవాడలో శ్రీమతి అమరావతి కార్యక్రమం

Srimati Amaravati: విజయవాడ నోవాటెల్‌లో శ్రీమతి అమరావతి కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో సినీనటి కామ్నా జెఠ్మలానీ, హీరోలు సన్నీ, సోహెల్, బిగ్​బాస్ తెలుగు ఫేమ్ సిరి, కాజల్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు చేసిన క్యాట్ వాక్, పాటలు, డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి.

అట్టహాసంగా జరిగిన శ్రీమతి అమరావతి కార్యక్రమం

Srimati Amaravati: విజయవాడ నగరంలోని నోవాటెల్​లో శ్రీమతి అమరావతి కార్యక్రమం సందడి సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటి కామ్నా జెఠ్మలానీ, హీరోలు సన్నీ, సోహెల్, బిగ్​బాస్ తెలుగు ఫేమ్ సిరి, కాజల్ తదితరులు పాల్గొన్నారు. వారి మాటలు, డైలాగ్స్​కు యువత ఉర్రూతలూగిపోయారు. యువత చప్పట్లు, కేకలతో హాలంతా మార్మోగింది. మహిళలు చేసిన క్యాట్ వాక్, పాటలు, డ్యాన్స్​లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారు చెప్పిన డైలాగ్స్​కి యువకులు కేరింతలు కొట్టారు. అనంతరం క్యాట్ వాక్, పాటలు, డ్యాన్స్​ల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విజయవాడలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కార్యక్రమానికి హాజరైన వారు తెలిపారు.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.