గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు

author img

By

Published : Sep 24, 2022, 7:55 AM IST

Updated : Sep 24, 2022, 8:45 AM IST

Police Restrictions

07:53 September 24

గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు

Police Restrictions On Amaravati Farmers Padayatra: గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న రైతులనే పాదయాత్రకు అనుమతిస్తున్నారు. ఐడీ కార్డులు లేని వారిని అనుమతించటం లేదు. ఐడీ కార్డులు లేని కారణంగా రైతులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐడీ కార్డులు లేవంటూ కంకిపాడు పీఎస్‌కు 20 మంది రైతులను తరలించారు. ఐడీ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తికాకముందే అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 24, 2022, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.