మంత్రి సురేశ్‌తో భేటీ.. రేపటి ధర్నా విరమించుకున్న ఒప్పంద అధ్యాపక సంఘాలు

author img

By

Published : Sep 27, 2021, 5:14 PM IST

contract employees meet with education minister suresh

ఎయిడెడ్ కాలేజీల్లో స‌ర్దుబాటుతో కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇబ్బంది ఉండ‌ద‌ని మంత్రి సురేశ్ (education minister suresh news) అన్నారు. ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

మంత్రి సురేశ్‌తో ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకులు(govt college contract employees news) సమావేశమయ్యారు. మేనిఫెస్టో హ‌మీలు అమ‌లు చేయాలని కోరుతూ సంఘాల నేతలు ఒప్పంద, తాత్కాలిక లెక్చరర్ల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఎయిడెడ్ కాలేజీల్లో స‌ర్దుబాటుతో కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇబ్బంది ఉండ‌ద‌ని మంత్రి హామీనిచ్చారు. మంత్రితో భేటీ అనంతరం రేపు ఇంటర్ కార్యాల‌యం వద్ద తలపెట్టిన ధ‌ర్నాను అధ్యాపక సంఘాలు విరమించుకున్నాయి.

ఇదీ చదవండి

AP RAINS: గులాబ్‌ తుపానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.