Suryanarayana Rao: అమలాపురం సీఐ బాజీలాల్ను వీఆర్లో పెట్టడం సరికాదని తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ అన్నారు. మంత్రి వేణు ఒత్తిడితో అమలాపురం సీఐని వీఆర్లో పెట్టారని ఆరోపించారు. బాజీలాల్ను మళ్లీ అమలాపురం సీఐగా నియమించాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 30 అమలులో పెట్టి అడ్డుకోవడం క్షమించరానిదని కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఒత్తిడి మేరకు అమలాపురం పట్టణ సీఐ బాజీ లాల్ను వీఆర్లో పెట్టడాన్ని ఖండిస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలోని శెట్టి బలిజ భవనంలో నిరసన సమావేశం నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోనసీమ కాపు ఐకాస అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, కార్మిక, ఆటో యూనియన్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: