యానాంలో ఆవుపై అత్యాచారం.. గంజాయి బ్యాచ్ పనే అంటున్న పోలీసులు

author img

By

Published : Jan 13, 2023, 10:43 AM IST

యానాంలో ఆవుపై అత్యాచారం

Cow Rape:గంజాయి మత్తులో ఆకతాయిలు మానవత్వం మరిచి, మూగజీవిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గుల అరాచకాలకు ఆ మూగ జీవి తాలలేక అసువులు బాసింది. ఈ ఘటన కాకినాడకు సమీపంలో యానంలో జరిగింది. స్థానిక రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ టీవీ దృశ్యాలలో అనుమానితులను పరిశీలిస్తున్నారు. మరల ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు..

Cow Rape: గంజాయి మత్తులో మదమెక్కి.. మతితప్పి, మానవత్వం మరచిన కొందరు పైశాచికంగా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ మూగజీవి తనువు చాలించింది. యానాంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పొగాకు ఈశ్వరరావు అనే రైతుకు చెందిన ఆవును నాలుగు కాళ్లను, మెడను తాళ్లతో కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ చోటులో గంజాయి తాగిన ఆనవాళ్లున్నాయి. గురువారం తెల్లవారు జామున కొబ్బరితోటకు వెళ్లిన ఈశ్వరరావుకు ఆవు చనిపోయి ఉండటంతో చలించిపోయాడు. ఆవు చనిపోయిన పరిస్థితులను బట్టి రైతు తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. దీంతో వెంటనే ఆయన యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఊపిరాడక పోవడంతో ఆవు మృతి చెంది ఉంటుందని పుదుచ్చేరి పశు వైద్యాధికారి కదిరేశన్‌ తెలిపారు. జంతువుతో లైంగిక చర్యకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. స్వగృహానికి సమీపంలో రైతు, తన కొబ్బరి తోటలో ఆవుల కోసం ప్రత్యేకంగా పశువుల పాక ఏర్పాటు చేశాడు. ప్రతీ రోజులాగే.. ఆ రోజు కూడా మేత కోసం ఆవులను పొలాల్లోకి తీసుకుపోయాడు. సాయంత్రానికి యదావిధిగా తిరిగి కొబ్బరి తోటలోని పాకకు ఆవులను చేర్చుతాడు. అనంతరం ఆవులకు ధానా పెట్టి చీకటి పడే సమయానికి తన గూటికి చేరుకుంటాడు ఆ రైతు. ఈ పశువుల పాక జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో.. అటుగా వెళ్తున్న కొందరు దుర్మార్గులకు ఆ పశువుల శాల కనిపించింది.. వారితో పాటు తెచ్చుకున్న మత్తుపానీయాలను సేవించేందుకు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపించింది. చుట్టు పక్కల జనజీవనం ఏమీ లేదు. ఇంకేముంది వారి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చివరికి మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనేది వాళ్లకి తెలియని పరిస్థితిలో గంజాయి మత్తులో మూగ జీవిపై అత్యాచారం చేసినట్లు .. అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దుర్మార్గుల అరాచకాలకు ఆ మూగ జీవి తాలలేక అసువులు బాసింది.. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మూగజీవి, దుర్మార్గుల చేతిలో చనిపోవడం, రైతును కలచివేసింది. ఈ ఘటనపై రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ టీవీ దృశ్యాలలో అనుమానితులను పరిశీలిస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.