వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

author img

By

Published : Jan 24, 2023, 11:40 AM IST

COMMERCIAL TAXES OFFICERS SUSPEND

COMMERCIAL TAXES OFFICERS SUSPEND : వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియా కథనాలు, వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ కమిటీ నివేదిక మేరకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంది

SUSPEND : వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని జీఎస్టీ విభాగంలో నలుగురు ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. మీడియా కథనాలు, వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక ఆధారంగా సస్పెండ్‌ చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశాలు ఇచ్చారు. జీఎస్టీ విభాగంలో పని చేస్తున్న ప్రసాద్‌, మెహర్‌ కుమార్‌, సంధ్య, గడ్డం ప్రసాద్‌ను సస్పెండ్‌ చేయడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఈ నలుగురు అధికారులు కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.