MURDER CASE : హత్యకేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్టు

author img

By

Published : Nov 25, 2021, 9:18 PM IST

ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ

గుంటూరు జిల్లాలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అఖిల్‌ను అరెస్టు చేసి, అతని నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా గుజ్జనగుండ్లలో ఈనెల 19న జరిగిన వివాహిత హత్య కేసును పట్టాభిపురం పోలీసులు ఛేదించారు. నిందితుడు గుగులోతు అఖిల్​ను అరెస్ట్ చేసి, అతని నుంచి మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించినట్లు వెల్లడించారు.

మృతురాలు నూతి నాగేశ్వరితో అఖిల్.. షేర్​చాట్ ద్వారా పరిచయమయ్యాడు. వీరి మధ్య పరిచయం సాన్నిహిత్యంగా మారింది. అయితే.. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం తలెత్తింది. ఈ ఘటనతో ఆగ్రహావేశానికి గురైన అఖిల్.. నాగేశ్వరిని కొట్టి హతమార్చాడు.

- ఆరిఫ్ హఫీజ్, గుంటూరు అర్బన్ ఎస్పీ

ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ఇదీచదవండి.

KRMB Letter : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ రాసిన కేఆర్‌ఎంబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.