ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే.. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి?: లోకేశ్​

author img

By

Published : Nov 23, 2022, 7:24 PM IST

Updated : Nov 23, 2022, 10:37 PM IST

LOKESH ON MP MOBILE MISSING

LOKESH ON MP MOBILE MISSING : ఎంపీ విజయసాయి ఇంట్లోనే దొంగలు పడితే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ప్రశ్నించారు. పోలీసులంతా ఫోన్​ వెతకటం కోసం వెళ్తే.. సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు.

NARA LOKESH ON MP VIJAYASAI MOBILE MISSING : దొంగ ఇంట్లోనే మరో దొంగ పడ్డాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లోనే దొంగలు పడితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌లోని వివరాలు ప్రజలకు తెలియాలని డిమాండ్​ చేశారు. దిల్లీ మద్యం స్కామ్‌, బ్రెజిల్ వ్యాపార వివరాలు అన్ని ఫోన్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సెల్‌ఫోన్‌ వెతికే పనిలో ఉన్నారన్న లోకేశ్‌.. పోలీసులంతా అటే వెళ్తే సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు.

విజయసాయి ఫోన్​ మిస్​: వైఎస్సార్​​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్​ఫోన్ పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి సెల్​ఫోన్​ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్​ఫోన్​ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్​లో అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే.. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి?: లోకేశ్​

ఇవీ చదవండి:

Last Updated :Nov 23, 2022, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.