DUGGIRALA MPP ELECTION: కోరం లేక వాయిదా పడిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక

author img

By

Published : Sep 25, 2021, 1:46 PM IST

Updated : Sep 25, 2021, 4:28 PM IST

confusion-in-duggirala-mpp-election

13:44 September 25

ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉన్న తెదేపా, జనసేన సభ్యులు

     గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికకు కోరం లేదని ఎస్ఈసీకి ఆర్​వో నివేదించారు. ఎంపీపీ ఎన్నిక తేదీని ఎస్ఈసీ తర్వాత ప్రకటించనుంది. 18 మంది ఎంపీటీసీలకుగాను వైకాపాకు చెందిన 8 మంది సభ్యులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. 

తెదేపాకు చెందిన 9 మంది సభ్యులు, జనసేనకు చెందిన ఒక సభ్యుడు ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉన్నారు. 50 శాతం మంది సభ్యులు ఉంటేనే ఎంపీపీ ఎన్నిక సాధ్యపడుతుంది. కోరం లేనందున మెుదటగా మ. 3 గంటలకు ఎన్నికల అధికారి ఎన్నికను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి ఉండటంతో కోరం లేదని ఆర్​వో రామ్‌ప్రసన్న ఎస్​ఈసీకి తెలిపారు. ఎస్‌ఈసీ నిర్ణయం మేరకు ఎంపీపీ ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు ఆర్‌వో. 

ఇదీ చూడండి: LIVE UPDATES: జడ్పీ ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Last Updated :Sep 25, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.