గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ భర్తపై సీబీఐ కేసు.. ఎందుకంటే..?

author img

By

Published : May 12, 2022, 12:35 PM IST

1

CBI case on Guntur chairperson husband: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టీనా భర్త సురేష్‌పై.. సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమంగా విదేశాల నుంచి నిధులు పొందారన్న అభియోగంపై ఈ కేసు నమోదైంది.

CBI case on Guntur chairperson husband: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టీనా భర్త.. హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడు కత్తెర సురేశ్‌పై సీబీఐ కేసు నమోదైంది. అక్రమంగా విదేశాల నుంచి నిధులు పొందారన్న అభియోగంపై దిల్లీలోని సీబీఐ అధికారులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

హార్వెస్ట్ ఇండియా కార్యకలాపాల కోసం విదేశీ నిధులు స్వీకరించే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని, పదవులను దుర్వినియోగం చేశారని ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. చిన్న పిల్లల దత్తత, విదేశాలకు తరలింపుపై కూడా సురేశ్​పై అభియోగాలు నమోదయ్యాయి. సురేశ్‌ కార్యకలాపాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. గుంటూరు ఎస్పీ అరీఫ్ హఫీజ్‌కు జాతీయ బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.