త్వరలో బీఆర్​ఎస్​లోకి ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు : సీఎం కేసీఆర్​

author img

By

Published : Jan 2, 2023, 10:41 PM IST

Updated : Jan 3, 2023, 6:26 AM IST

cm kcr

Thota Chandrasekhar join to BRS: ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు సైతం బీఆర్​ఎస్​లో చేరేందుకు ముందుకొస్తున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్​ అన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తే.. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకుంటామన్నారు. భారత్‌ రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామన్నారు.

Ravella Kishorebabu joined BRS: భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్​ నియమించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు తదితరులు బీఆర్​ఎస్​లో చేరారు.

సీఎం కేసీఆర్​

సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్​ఎస్​లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. సిట్టింగులు బీఆర్​ఎస్​లో చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసినా.. బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే తిరిగి వెనక్కి తీసుకుంటామని కేసీఆర్​ పేర్కొన్నారు. ఎంత ఖర్చయినా మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లోకి తీసుకొస్తామననారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే.. తమది జాతీయీకరణ విధానమన్నారు.

సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్​ఎస్​ కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. ఏపీతో పాటు మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో కమిటీలు సిద్ధమయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల 49 వేల గ్రామాలు, 4 వేల 3 వందల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాంతరంగా బీఆర్​ఎస్​ విస్తరిస్తుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వంటి పథకాలు కావాలని మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో డిమాండ్ ఉందన్నారు. భారత్‌ రాష్ట్ర సమితి ఒక రాష్ట్రం, కులం, మతం కోసమో కాదని.. బీఆర్​ఎస్​ దేశం కోసమని కేసీఆర్ తెలిపారు. బీఆర్​ఎస్​కు రాజకీయాలు క్రీడ కాదని.. ఒక టాస్క్ అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం బీఆర్​ఎస్​కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోడుగా ఉండాలని కేసీఆర్ కోరారు. తమ పీఠాల కిందకు నీళ్లు వస్తాయనుకునే వారు ఏదో మాట్లాడుతుంటారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

బీఆర్​ఎస్​లో పనిచేసిన వారికి స్వాతంత్య్ర పోరాట యోధులకు దక్కిన గౌరవం దక్కుతుందన్నారు. దేశంలో పరిస్థితులు, బీఆర్​ఎస్​ అవసరమేంటో త్వరలో శిక్షణ తరగుతులు నిర్వహిస్తామని చెప్పారు. రాజకీయ ప్రయాణంలో జయాపజయాలు ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

"రాజకీయాలు అంటే ఒక కార్యాచరణ.. కానీ కొందరు దాన్ని ఆటగా మార్చారు. భారాసకు అధికారమిస్తే రెండేళ్లలో వెలుగుజిలుగుల భారత్‌ను సాకారం చేస్తాం. దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం అసాధ్యమేమీ కాదు. రూ.1.45 లక్షల కోట్లతో దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొచ్చు. భారాసకు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తాం. దేశంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తాం. విశాఖ ఉక్కును మోదీ అమ్మితే.. మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకుంటాం. మోదీ విధానం ప్రైవేటైజేషన్‌ మాది నేషనలైజేషన్‌. స్వాతంత్య్ర సమరయోధులకు దక్కినంత గౌరవం భారాస నేతలకు దక్కుతుంది. సంక్రాంతి తర్వాత చాలా రాష్ట్రాల్లో భారాస కార్యాచరణ ఉరుకులు పరుగులు పెడుతుంది." - కేసీఆర్, ముఖ్యమంత్రి

బీఆర్​ఎస్​కు అధికారమిస్తే రెండేళ్లలో వెలుగుజిలుగుల భారత్​ నిర్మిస్తామని సీఎం కేసీఆర్​ అన్నారు. దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వటం అసాధ్యమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. రూ.1.45 లక్షల కోట్లతో దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చునని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​కు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తామని.. దేశంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 3, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.