Suicide of Love Married Youth: ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఎదురించి పెళ్లి.. మూడు నెలలకే యువకుడి ఆత్మహత్య.. అసలేమైంది..?

Suicide of Love Married Youth: ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఎదురించి పెళ్లి.. మూడు నెలలకే యువకుడి ఆత్మహత్య.. అసలేమైంది..?
Suicide of Love Married Youth: ఏడేళ్లు ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి ఒక్కటయ్యారు. మూడు నెలలు గడిచాయో లేదో వారిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అంతలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడలు వైఖరికి తోడు.. పోలీసుల హెచ్చరికలే తన కుమారుడిని బలిగొన్నాయని యువకుడి తల్లి ఆరోపిస్తోంది.
Suicide of Love Married Youth: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. వివాహమై మూడు నెలలు కాకముందే కాపురంలో వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలు పరిష్కరించుకోలేక పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో ఆ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన ఏలూరు (Eluru) జిల్లాలో చోటు చేసుకుంది. దెందులూరు గ్రామానికి చెందిన చుక్క తేజ్ మూర్తి, ఏలూరుకు చెందిన ప్రియాంక.. వీళ్లిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవటంతో మూడు నెలల క్రితం వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు.
Mother Comments on Police: పోలీసుల వేధింపులే కారణమని.. ప్రస్తుతం తేజ మూర్తి హైదరాబాద్ ఇన్ఫోసిస్ (Infosys)లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమ వివాహాన్ని (Love Marriage) ఒప్పుకుని వారిని ఇంటికి తీసుకెళ్లి వారిని చక్కగా చూసుకుంటున్నామని తేజ్ మూర్తి తల్లి రమాదేవి తెలిపింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావటంతో.. తరచూ గొడవలు జరుగుతున్నాయని, తన కోడలు ప్రియాంక వరలక్ష్మి పండగకు ఇంటికి వెళ్లిందని, ఆ తర్వాత ఓ లాయర్ ద్వారా ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తన కొడుకు తేజ్ మూర్తి పై ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ విషయమై వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసులు భార్యాభర్తలకు ఎటువంటి కౌన్సిలింగ్ (Counseling) ఇవ్వకుండా పది లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని,.. లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతానని వేధింపులకు గురి చేశారని తల్లి రమాదేవి ఆరోపించింది. వన్ టౌన్ పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తన కొడుకు ఈ రోజు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన కొడుకు మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు.
DSP Pressnote on Tejmurthy Suicide Case: దర్యాప్తు కొనసాగుతోంది.. ఈ విషయంపై ఏలూరు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఏలూరు వన్ టౌన్ సీఐ వేధింపుల వల్ల చుక్క తేజ మూర్తి అనే ఇన్ఫోసిస్ ఉద్యోగి రైల్వే ట్రాక్పై ఆత్మ హత్య చేసుకున్నట్టుగా సోషల్ మీడియా (Social media) లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. యువకుడు తేజ మూర్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఇరుపక్షాలకు చెందిన కుటుంబ సభ్యులు, పెద్ద మనుషుల సమక్షంలో సీఐ భార్య, భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారని వెల్లడించారు. సూసైడ్ నోట్లో కూడా మృతుడు తనను సీఐ వేధించినట్లుగా ఎక్కడా చెప్పలేదని డీఎస్పీ (DSP) పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణ కూడా జరుగుతున్నదని... అవాస్తవాలు ప్రచారం చేయవద్దని తెలిపారు.
