మాయమవుతున్న పోలవరం కాలువ గట్లు... ఇలాగే కొనసాగితే..

author img

By

Published : May 11, 2022, 5:59 AM IST

Updated : May 11, 2022, 7:01 AM IST

మట్టి రవాణా

Polavaram: పోలవరం కాలువ గట్లు రానురాను మాయమవుతున్నాయి. గట్లకు ఇరువైపులా మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. వందల టిప్పర్లతో మట్టిని దోచేస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని, కాలువ గట్లకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

కుంచించుకుపోతున్న పోలవరం కాలువ గట్లు... ఇలాగే కొనసాగితే...

Polavaram: ఉమ్మడి కృష్ణాజిల్లాలో 54 కిలోమీటర్ల మేర పోలవరం కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువ నిర్మాణం సమయంలో..పూడిక తీసిన మట్టిని గట్టుకు వేశారు. ఇప్పుడు ఆ మట్టిని కొందరు అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో జేసీబీలతో తవ్వేస్తున్నారు. ఇలానే కొనసాగితే గట్టుకే ప్రమాదం ఏర్పడే అవకాశమున్నా... అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా గన్నవరం పరిధిలో ఈ మట్టి తవ్వకాలు అధికంగా జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సూరంపల్లి పరిధిలోనూ రాత్రి, పగలు తేడా లేకుండా పెద్దఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ-నూజివీడు రాహదారి సమీపంలోనూ చాలాచోట్ల తవ్వుతున్నారు.

అయితే వివిధ పనుల కోసం పరిమిత మెుత్తంలో తవ్వకాలకు అనుతులు ఇచ్చినట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. గనుల శాఖ నుంచి అధికార పార్టీ నేతలేఅనుమతులు పొందినట్లు తెలిసింది. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులూ వత్తాసు పలుకుతున్నారంటూ జనం ఆరోపిస్తున్నారు. వందల టిప్పర్లతో ఎర్రమట్టి తరలిస్తూ కొందరు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఒక్క సూరంపల్లి పరిధిలోనే కాకుండా బాపులపాడు మండలం బండారుగూడెం, విజయవాడ గ్రామీణ పరిధిలోని పాతపాడు, నున్న పరిధిలోనూ అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: POLAVARAM: పోలవరం తొలి దశకు రూ.9,000 కోట్లు..అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం

Last Updated :May 11, 2022, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.