రూ.50 వేలు చెల్లించు.. బాల్య వివాహం విషయంలో చైల్డ్ లైన్ సిబ్బంది అక్రమాలు

author img

By

Published : Sep 11, 2022, 12:34 PM IST

Child line staff Irregularities

Child line staff Irregularities: ఓ బాల్య వివాహం విషయంలో చైల్డ్ లైన్ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?

Child line staff Irregularities: ఓ బాల్య వివాహం విషయమై చైల్డ్‌లైన్‌ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు బాల్య వివాహం జరిగినట్లు స్థానిక వాలంటీర్లు చైల్డ్‌ లైన్‌ 1098కి సమాచారం ఇచ్చారు. వారు ఏలూరులోని చైల్డ్‌ లైన్‌ సిబ్బందికి తెలియజేశారు. వీరు బాల్య వివాహం చేసుకున్న యువకుడి తల్లిదండ్రులను ఏలూరుకు పిలిపించి బేరసారాలకు సాగించారు. ఈ నేపథ్యంలో బాధితులు మీడియాను ఆశ్రయించారు. ‘వారంలోగా అమ్మాయి పేరున రూ.లక్ష చెల్లించకపోతే యువకుడు జైలుకు వెళ్తాడని చైల్డ్‌ లైన్‌ సిబ్బంది బెదిరించారని, పేదరికం కారణంగా రూ.20 వేలు మాత్రమే కట్టగలం’ అని ప్రాధేయపడ్డామని బాధితులు తెలిపారు. అయినా ససేమిరా అంటూ.. వారం రోజుల్లోగా రూ.50 వేలు చెల్లించేలా బలవంతంగా సంతకాలు, వేలి ముద్రలు తీసుకున్నారని వాపోయారు. దీనిపై ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.