వినాయక ఉత్సవాలలో అపశ్రుతి..విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కళాకారులు మృతి

author img

By

Published : Sep 18, 2021, 3:51 PM IST

electric-shock

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలో వినాయక ఉత్సవాలలో అపశ్రుతి జరిగింది. కథ చెబుతుండగా కళాకారులు విద్యుదాఘాతానికి గురైయ్యారు. ఆసుపత్రికి తీసుకుపోతుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కోల సంబరంలో కళాకారులు కథ చెప్పారు. ఆ సమయంలో మైకుతో విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలో జరిగింది. ప్రధాన కథకులు వాసంశెట్టి వెంకన్న(35).. మేడిశెట్టి శ్రీనివాసులు(36) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

శవ పంచనామా అనంతరం మృతదేహాలను యానాం ఆసుపత్రి శవాగారంలో భద్రపరిచారు. మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

ఇదీ చదవండి: TWO DEAD: కరపలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.