వైకాపా నేతలతో కలిసి వాలంటీర్ల ఎన్నికల ప్రచారం

author img

By

Published : Apr 10, 2021, 9:45 PM IST

volunteers election campaign in kampallem, tirupati bi election campaign

వైకాపా నేతలతో కలిసి వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివాదం నెలకొంది. చిత్తూరు జిల్లా బీఎన్​ కండ్రిగ మండలం కాంపాళ్లెంలో ఈ ఘటన జరిగింది. వాలంటీర్ల ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నా వారు లెక్క చేయలేదు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా చిత్తూరు జిల్లా బీఎన్​ కండ్రిగ మండలం కాంపాళ్లెంలో.. వైకాపా కార్యకర్తలతో కలిసి వాలంటీర్లు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ వాలంటీర్లు ప్రచారం చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు

నెలవారీ జీతాలను ప్రభుత్వం ఇస్తుందా లేక వైకాపానా అని వాలంటీర్లను స్థానికులు ప్రశ్నించారు. ఈ ఘటనపై గ్రామంలో వివాదం నెలకొంది. ఇదేమీ లెక్క చేయకుండా అధికార పార్టీ నేతలతో కలిసి వారు పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతికి వస్తే హోమ్ ఐసోలేషన్​లో ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.