కర్నూలు జిల్లా: తుగ్గలి గ్రామంలో ఏం జరుగుతుంది..! ప్రజలు ఇళ్లలో ఎందుకు ఉండొద్దు..!

author img

By

Published : Mar 10, 2023, 7:55 PM IST

Updated : Mar 10, 2023, 8:59 PM IST

Etv Bharat

midd night houses cracks : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామంలో పది ఇళ్లల్లో ఏకకాలంలో గోడల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. వీధిలో సీసీ రోడ్డు కూడా పగిలిపోయింది. పైపు లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

midd night houses cracks : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామంలో గత సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ వీధిలోని 10 ఇళ్లల్లో ఏకకాలంలో గోడల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఎలాంటి పరిష్కారం చూపకపోగా.. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే విషయాన్ని స్పష్టంగా ఎవరూ చెప్పకుండా వెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరూ, ఏ విషయం చెప్పకపోవడంతో ప్రతి రోజూ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని బాధను వ్యక్తం చేస్తున్నారు.

అర్ధరాత్రి గుబులు.. అర్ధరాత్రి సమయంలో ఇళ్లల్లో పగుళ్లు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సమయంలో పదిళ్లలో ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అంతేకాదు... సిమెంటు రహదారి సైతం పగుళ్లు ఇచ్చింది. పైప్ లైన్లు సైతం దెబ్బ తినడంతో పాటు, తాగునీరు బయటకు చిమ్మడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. భూకంపమా లేక మరేదైనా ప్రకృతి వైపరీత్యమో తెలియక గ్రామస్తులు నలిగిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామంలో గత సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ వీధిలోని 10 ఇళ్లల్లో ఏకకాలంలో గోడల్లో పగుళ్లు ఏర్పడడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

పరిష్కారం చెప్పడం లేదంటూ.. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఎలాంటి పరిష్కారం చూపకపోగా.. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే విషయాన్ని స్పష్టంగా ఎవరూ చెప్పకుండా వెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళలో బయటే పడుకోవాలని, ఇళ్లల్లో ఉండకూడదని చెబుతున్న అధికారులు... ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో వివరించడం లేదని ఇలా ఎన్నాళ్ళు ఆరుబయటే ఉంటూ కాలం వెళ్ళబుచ్చాలంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో గుర్తించి పరిష్కారం చూపాలని వారు మొరపెట్టుకుంటున్నారు.

రాత్రి ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. పొద్దున్నే లేచి చూసే సరికి ఇంటి గోడలు పగుళ్లుబారాయి. ఇళ్ల ఎదుట సీసీ రోడ్డు కూడా పగిలిపోయింది. పైపు లైన్లు దెబ్బతిని నీళ్ల సమస్య కూడా వచ్చింది. పది రోజుల కిందట ఇలా జరగడంతో అధికారులు, నాయకులు, ఎమ్మెల్యే కూడా వచ్చి చూసి వెళ్లారు కానీ, ఎందుకు ఇలా జరిగిందో చెప్పలేదు. రాత్రి వేళ ఇంట్లో కాకుండాబయట ఉండమని సలహా ఇస్తున్నారు గానీ.. ఎన్ని రోజులు ఇలా ఉండాలో, అసలు సమస్య ఏమిటో చెప్పడం లేదు. - నాగయ్యా చారి, తుగ్గలి గ్రామస్తుడు

ఇళ్లకు పగుళ్లు..

ఇవీ చదవండి :

Last Updated :Mar 10, 2023, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.