చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయమైన.. శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో.. ఓ భక్తుడు ఉత్సవమూర్తులకు వెండి కిరీటాలను బహుకరించాడు. శ్రీకాళహస్తికి చెందిన గిరిజా మనోహర్ శర్మ అనే భక్తుడు.. స్వామి, అమ్మవార్లకు.. 445 గ్రాముల రెండు వెండి కిరీటాలను శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులకు అందజేశారు.
ఇదీ చదవండి: తెలుగునాట వివాహ వేడుకలపై సందిగ్ధత..!