ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. ట్రయల్ రన్ పూర్తి

author img

By

Published : Jan 29, 2023, 4:53 PM IST

Updated : Jan 29, 2023, 7:18 PM IST

వందే భారత్ రైలు ట్రయల్ రన్

Vande Bharat Train Trial Run: కేెంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందేభారత్ ఎక్స్​ప్రెస్ రైళ్లను వివిధ ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 8వ వందేభారత్ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించారు. అలాగే వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్​ప్రెస్ సేవలను అందుబాటులోకి తేనుంది. అందుకు వందేభారత్ ఎక్స్​ప్రెస్ రైలుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

Vande Bharat Train Trial Run : కేెంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న వందేభారత్ ఎక్స్​ప్రెస్​ సేవలు ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నూతనంగా ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్​ప్రెస్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రోజు చెన్నై నుండి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా ఒంగోలు ఉదయం గం 5.20 నిమిషాలకు, చీరాల 6.25 నిమిషాలకు, విజయవాడకు ఉదయం గం 8.25 నిమిషాలకు చేరుకుంది.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ట్రయల్ రన్

ఫిబ్రవరి నెలలో ఈ వందేభారత్ రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ నెల 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 8వ వందేభారత్ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించగా.. వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నూతనంగా ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్​ప్రెస్ 9వది కానుంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 29, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.