Children drowned: అనంతపురంలో విషాదం.. చెరువులో ముగ్గురు చిన్నారులు గల్లంతు

author img

By

Published : Oct 11, 2021, 5:53 PM IST

Updated : Oct 11, 2021, 7:23 PM IST

three children drowned in pond at amadaguru mandal

17:50 October 11

అమడగూరు మండలం ఎగువతండాలో ఘటన

అనంతపురం జిల్లా అమడగూరు చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారులు

బట్టలు ఉతకడానికి తల్లితో కలసి వెళ్లిన ముగ్గరు పిల్లలు చెరువులో పడిపోయిన ఘటన.. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు.. ముగ్గురు పిల్లలతో దుస్తులు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. అప్పటివరకు నీటిలో ఆడుకుంటున్న పిల్లలు.. హఠాత్తుగా చెరువులో మునిగిపోయారు. ఈ విషయాన్ని అక్కడున్న మహిళలు గమనించేలోపే వారు గల్లంతయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. కానీ పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: 

JAC MEETING: రేపు అమరావతి ఐకాస నేతల కీలక సమావేశం..భవిష్యత్​ కార్యాచరణపై చర్చ

Last Updated :Oct 11, 2021, 7:23 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.