Paritala Sunitha: వాళ్లు ఎన్ని దౌర్జన్యాలు చేసినా పట్టించుకోరా? : పరిటాల సునీత

author img

By

Published : Oct 18, 2021, 5:31 PM IST

ఎన్ని దౌర్జన్యాలు చేసినా పట్టించుకోరా

వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కుంటిమద్దిలో 'నీరు-చెట్టు' పైలాన్ ధ్వంసం చేసిన ఘటనలో.. పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్దిలో దుండగులు 'నీరు-చెట్టు' పైలాన్ కూలదోసి, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై మాజీమంత్రి పరిటాల సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇలాంటివి మామూలేనంటూ రామగిరి ఎస్సై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కుంటిమద్ది చెరువుకట్టపై ఉన్న పైలాన్ వద్ద పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయించారు.

ఎన్ని దౌర్జన్యాలు చేసినా పట్టించుకోరా

రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా.. పోలీసులు పట్టించుకోవడంలేదని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలాన్ ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.