అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్దిలో దుండగులు 'నీరు-చెట్టు' పైలాన్ కూలదోసి, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై మాజీమంత్రి పరిటాల సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇలాంటివి మామూలేనంటూ రామగిరి ఎస్సై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కుంటిమద్ది చెరువుకట్టపై ఉన్న పైలాన్ వద్ద పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయించారు.
రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా.. పోలీసులు పట్టించుకోవడంలేదని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలాన్ ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు