Minister Shankar Narayana: కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నీటి వాటా సాధిస్తాం: మంత్రి శంకర్ నారాయణ

author img

By

Published : Oct 17, 2021, 7:59 PM IST

minister shankar narayana fires on tdp over meeting on water issues

నదీ జలాల అంశంపై.. అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా సమావేశం నిర్వహించడంపై.. మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నీటి వాటా సాధిస్తామన్నారు.


తెదేపా నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై నిర్వహించే బూటకపు సమావేశాలు నిర్వహించడం మానుకోవాలని.. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ(minister shankar narayana) హితవు పలికారు. నదీ జలాల అంశంపై.. అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా(tdp) సమావేశం నిర్వహించడంపై.. ఆయన మండిపడ్డారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నీటి వాటా సాధిస్తామని.. తెదేపా నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ఎటువంటి అక్రమ ప్రాజెక్టులు కట్టిన చట్టపరంగా న్యాయపరంగా పోరాడి రావలసిన వాటా జలాలను తెచ్చుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

గంజాయి స్మగ్లర్ల కోసం ఏవోబీలో నల్గొండ పోలీసులవేట.. కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.