GIBBON CATCH: ముప్పతిప్పలు పెట్టింది.. చివరికి బోనుకు చిక్కింది

author img

By

Published : Sep 25, 2021, 1:43 PM IST

gibbon

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో ముప్పతిప్పలు పెడుతున్న కొండముచ్చును (gibbon catch by forest staff) అటవీశాఖ సిబ్బంది బంధించింది. రెండున్నరేళ్లు వయస్సున్న కొండముచ్చును కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అధికారులు చెప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో కొండముచ్చును అటవీశాఖ అధికారులు(gibbon catch by forest staff) బంధించారు. ముప్పలకుంట గ్రామంలో కొద్దిరోజులుగా ఓ కొండముచ్చు తెగ అల్లరి చేస్తోంది. గ్రామంలోని ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదే విషయాన్ని గ్రామస్థులంతా కలిసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఎలాగైనా కొండముచ్చును పట్టుకుని తమను రక్షించాలని కోరారు. కొండముచ్చు గురించి తమకు అందిన ఫిర్యాదు మేరకు శనివారం ఉదయం అటవీ అధికారులు గ్రామంలో బోను ఏర్పాటు చేశారు. కొండముచ్చను బంధించారు. బంధించిన కొండముచ్చుకు రెండున్నరేళ్ల వయసు ఉంటుందని కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో వదిలి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : వికటించిన ఆర్​ఎంపీ వైద్యం..ఆ తర్వాత ఏం చేశాడంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.