తప్పిన పెను ప్రమాదం...40 మంది మహిళలు సురక్షితం

author img

By

Published : Nov 22, 2021, 10:16 AM IST

తప్పిన పెను ప్రమాదం

40 మంది మహిళా కార్మికులతో బయలు దేరిన బస్సు చెరువులో చిక్కుకున్న ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. వారిని గమనించిన స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

తప్పిన పెను ప్రమాదం

అనంతపురం జిల్లా హిందూపురంలో పెను ప్రమాదం తప్పింది. 40 మహిళా కార్మికులతో బయలు దేరిన బస్సు చెరువు నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు మహిళలను రక్షించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిందూపురంలో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముూడు రోజులుగా హిందూపురం, అనంతపురం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ రోజు వరద ప్రవాహం తగ్గడంతో కొట్నూరు నుంచి 40 మంది మహిళలు ప్రయాణం సాగించారు. అయితే కొట్నూరు చెరువు నీటి ప్రవాహానికి బస్సు నీటి కుంట వైపు ఒరిగింది. గమనించిన స్థానికులు హుటాహుటిన బస్సు వద్దకు చేరుకోని మహిళ కార్మికులను రక్షించారు. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు రాకపోకలను నిషేధించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: World Fisheries Day 2021: మత్స్యకారుల ఉత్సాహం..పడవల విన్యాసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.