Accident: ద్విచక్ర వాహనం, బొలెరో ఢీ..ఇద్దరు యువకులు మృతి

author img

By

Published : Oct 17, 2021, 10:35 PM IST

Accident

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​ను బొలేరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తనకల్లు మండలం చీకటి మాన్​పల్లి వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటకలోని ఏలూరు ప్రాంతానికి చెందిన వెంకటేశ్, శీను ఇద్దరూ కుటుంబాలతో పాటు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్​కు వలస వచ్చారు. ఊరూరు తిరుగుతూ మిక్సీలు, గృహోపకరణ సామగ్రి మరమ్మత్తు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకల్లు నుంచి వెంకటేశ్ ,శీను ఓకే ద్విచక్రవాహనంపై కొక్కంటి క్రాస్​కు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం వేగంగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నట్లు తనకల్లు ఎస్​ఐ శ్రీనివాసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: కాలువలో కొట్టుకుపోతున్న చిన్నారులను రక్షించాడు...కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.