అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తనకల్లు మండలం చీకటి మాన్పల్లి వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటకలోని ఏలూరు ప్రాంతానికి చెందిన వెంకటేశ్, శీను ఇద్దరూ కుటుంబాలతో పాటు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్కు వలస వచ్చారు. ఊరూరు తిరుగుతూ మిక్సీలు, గృహోపకరణ సామగ్రి మరమ్మత్తు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకల్లు నుంచి వెంకటేశ్ ,శీను ఓకే ద్విచక్రవాహనంపై కొక్కంటి క్రాస్కు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం వేగంగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నట్లు తనకల్లు ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కాలువలో కొట్టుకుపోతున్న చిన్నారులను రక్షించాడు...కానీ..