BEAR DEATH: విద్యుదాఘాతంతో ఎలుగుబంటి మృతి..

author img

By

Published : Sep 23, 2021, 7:21 PM IST

BEAR DIED

వ్యవసాయ పొలాల్లో విద్యుదాఘాతంతో ఓ ఎలుగుబంటి మృతి చెందింది. అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లిలో ఈ ఘటన జరిగింది.

అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లిలో విద్యుదాఘాతంతో ఓ ఎలుగుబంటి మృత్యువాతపడింది. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు కట్టిన రాతి కట్టడం ఎత్తు తక్కువగా ఉండడంతో.. వాటిని గమనించక రాత్రి సమయంలో అక్కడి వచ్చిన ఎలుగుబంటి విద్యుదాఘాతానికి గురైందని అధికారులు తెలిపారు. మృతి చెందిన ఎలుగుబంటికి అధికారులు సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి అనంతరం దహనం చేశారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరారు.

ఇదీ చదవండీ.. Free Accommodation: హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.