ఈ నెలాఖరులోగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని... లేకపోతే 2024 ఎన్నికల్లో తమను దూరం చేసుకోవాల్సి వస్తుందని సీఎం జగన్కు... ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అల్టిమేటమ్ ఇచ్చారు. అమలాపురంలో శెట్టిబలిజలతో.. ఆ సంఘం కన్వీనర్ సూర్యనారాయణరావు భేటీ అయ్యారు. మంత్రి వేణుగోపాలకృష్ణ.. శెట్టి బలిజ సామాజిక వర్గం పరువు తీస్తూ తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లడం సహించరానిదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: