Couple Suicide: బావిలో దూకి దంపతుల ఆత్మహత్య... ఎక్కడంటే..?

author img

By

Published : Sep 22, 2022, 10:27 AM IST

Couple Suicide

Couple Suicide : అనకాపల్లి జిల్లా కసింకోటలో విషాదం చోటు చేసుకుంది. దంపతులు బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే..?

Couple Suicide : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో వ్యవసాయ బావిలో పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన దూళి శ్రీను కసింకోట మండలానికి చెందిన దూళి చిన్నారి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇటీవల కసింకోటకు వచ్చిన వీరిద్దరూ అత్తవారింటి వద్ద గొడవపడ్డారు. మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయలుదేరిన వీరు బుధవారం బావిలో విగత జీవులుగా కనిపించారు. భర్త దూళి శ్రీను, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

విజయనగరంలో డ్రగ్స్​ కలకలం.. ఇద్దరు అరెస్ట్​

Delhi Liquor Scam: దిల్లీ మద్యం వ్యవహారం.. వెన్నమనేనిపై ప్రశ్నల వర్షం

ఓరి దేవుడా.. విశ్వక్​ సేన్​ హీరోయిన్​ భలే ఉందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.