అల్లూరి జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని చిన్నారి మృతి, 9మందికి అస్వస్థత

author img

By

Published : Mar 15, 2023, 4:50 PM IST

kalusita aharam

Tragedy in Alluri Sitaramaraju district: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు.. కలుషిత ఆహారం తిని, అస్వస్థతకు గురయ్యారు. అందులో మీనాక్షి అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందగా..మిగిలినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. ఘటనకు సంబంధించిన వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

కలుషిత మంసాహారం తిని చిన్నారి మృతి, 9మందికి అస్వస్థత

Tragedy in Alluri Sitaramaraju district: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయతీ తడక గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కటుంబానికి చెందిన 9 మంది సభ్యులు.. కలుషిత మాంసాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో గమనించిన స్థానికులు.. 9 మందిని హూటాహూటిన గన్నేల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. మీనాక్షి అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందగా, మిగిలినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని విశాఖపట్టణానికి తరలిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నెల పంచాయతీ తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు.. మంగళవారం రాత్రి మేక మాంసాన్ని వండుకొని తిన్నారు. అనంతరం ఆ మంసాన్ని తిన్న 9మంది కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు కావడం మొదలయ్యాయి. వారిలో మీనాక్షి అనే ఐదేళ్ల చిన్నారికి వీరేచనాలు వెంటవెంటనే కావడంతో ఆ బాధను తట్టుకోలేక మృత్యువాత పడింది. దీంతో చుట్టుప్రక్కల వారు అప్రమత్తమై.. 108 వాహనానికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే తడక గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ (108).. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం తరలించింది. బాధితుల పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువులు ఆవేదన చెందుతున్నారు.

స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకోని.. మాంసాన్ని ఎక్కడ కొన్నారు?.. ఆహారంలో ఏం కలిసింది? అనే తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. కలుషిత ఆహారం కారణంగా.. చిన్నారి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృతి చెందిన బాలిక మృతదేహాన్ని గ్రామంలోనే ఉంచి.. అస్వస్థతకు గురైన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. అస్వస్థతకు గురైన కుటుంబ సభ్యులంతా త్వరగా కోలుకొని.. వారంతా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని గ్రామస్థులు, వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

మరోవైపు మేక మాంసం కలుషితం కావడం వల్లనే ఈ ఘటన జరిగిందని, ఆ మాంసాన్ని తిన్న 9మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి.. తమ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, వైద్య సేవలను అందించాలని పలు గ్రామాల స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో నివాసిస్తున్నవారు అనారోగ్యానికి గురైతే, దగ్గరలో ఆసుపత్రి లేక నానా అవస్థలు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.

ఇవీ చదవండి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.