Jogamma surrendered: అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు దళ సభ్యురాలు జోగమ్మ లొంగిపోయారు. ఓఎస్డీ కృష్ణకాంత్ ఎదుట ఆమె లొంగిపోయారు. జోగమ్మ స్వస్థలం ఎటపాక మండలం సాలిబుడప. పోడియం జోగమ్మ అలియాస్ రితికపై రూ.లక్ష రివార్డు ఉంది. 2019లో దళ సభ్యురాలిగా చేరిన పోడియం జోగమ్మ.. 2021లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. 2021 నాటి ఎదురుకాల్పుల్లో 22 మంది పోలీసులు, ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.