Tokyo Paralympics: భారత్​కు మరో పతకం.. బ్యాడ్మింటన్​లో కృష్ణకు స్వర్ణం

author img

By

Published : Sep 5, 2021, 9:50 AM IST

Updated : Sep 5, 2021, 10:27 AM IST

Tokyo Paralympics

09:46 September 05

Tokyo Paralympics: భారత్​కు మరో పతకం.. బ్యాడ్మింటన్​లో కృష్ణకు స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్​లో భారత్​కు మరో పతకం వచ్చింది. బ్యాడ్మింటన్​ పురుషుల సింగిల్స్​ ఎస్​హెచ్​-6 విభాగంలో.. స్వర్ణం సాధించాడు నాగర్​ కృష్ణ. ఫైనల్లో హాంకాంగ్​ షట్లర్​పై 21-17, 16-21, 21-17 తేడాతో నెగ్గాడు. ఈ బంగారు పతకంతో భారత్​ ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు వచ్చాయి.  

అంతకుముందు బ్యాడ్మింటన్​లో ఎస్​ఎల్​-3 విభాగంలో ప్రమోద్​ భగత్​కు గోల్డ్​ మెడల్​ రాగా.. ఎస్​ఎల్​-4విభాగంలో యతిరాజ్​కు రజతం దక్కింది.  దీంతో బ్యాడ్మింటన్​లో మూడు పతకాలు వచ్చాయి.  

మొత్తంగా ప్రస్తుత ఒలింపిక్స్​లో ఇప్పటివరకు భారత పతకాల సంఖ్య 19కి చేరింది.

Last Updated :Sep 5, 2021, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.