మహిళా హాకీ జట్టులో స్ఫూర్తినింపిన ప్రధాని మోదీ

author img

By

Published : Aug 6, 2021, 2:15 PM IST

pm modi

భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ చేశారు. ఒలింపిక్స్​ కాంస్య పతక పోరులో ఓడిపోయినప్పటికీ.. మహిళలు దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పేరుపేరునా అభినందనలు తెలిపారు.

ఒలింపిక్స్​ కాంస్య పోరులో గ్రేట్​ బ్రిటన్​పై ఓడిన భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ ద్వారా సంభాషించారు. ఓడిపోయినా.. మహిళలు తమ ప్రదర్శనతో దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.

మోదీ సంభాషణ సాగిందిలా..

రాణి రాంపాల్​:- నమస్కారం సర్​.

మోదీ:- నమస్తే నమస్తే.. మేమందరం మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. 5-6ఏళ్లుగా మీరు చేసిన కఠిన సాధనను మేము చూస్తూనే ఉన్నాం. మీ కష్టం ఎక్కడికీ పోలేదు. కష్టంతో మీకు పట్టిన చెమటలు.. దేశంలోని ఆడబిడ్డలకు స్ఫూర్తిగా నిలిచాయి. నేను మీ జట్టు బృందం, కోచ్​, అందరికి శుభాకాంక్షలు చెబుతున్నా.

రాణి రాంపాల్​:- థ్యాంక్యూ సర్​. మీరు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

మోదీ:- నిరాశ పడకూడదు. నేను చూశా.. నవనీత్​ కళ్లకు దెబ్బ తగిలిందా?

రాణి రాంపాల్​:- అవును సర్​. నిన్న దెబ్బ తగిలింది. 4 కుట్లు పడ్డాయి.

మోదీ:- చూస్కుని ఉండాల్సింది. కళ్లుకు ఇబ్బంది ఏమైనా ఉందా?

రాణి రాంపాల్​:- లేదు సర్​. బాగుంది.

మోదీ:- వందన.. మీరందరూ చాలా బాగా ఆడారు. సలీమా గొప్పగా ఆడుతుందని అందరికీ అనిపించింది.

రాణి రాంపాల్​:- థ్యాంక్యూ సర్​.

మోదీ:- మీరు కన్నీళ్లు పెట్టుకోకండి. నాకు వినిపిస్తోంది. మీరు కన్నీళ్లు పెట్టుకోకండి. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. అస్సలు నిరాశపడకూడదు. మీ వల్ల చాలా ఏళ్ల తర్వాత.. హాకీలో దేశం పేరు పునర్జీవం పోసుకుంటోంది. ఇది మీ కష్టం వల్లే.

కోచ్​ కూడా చాలా బాగా పనిచేశారు. మీ శ్రమ కనపడుతోంది. ఇలాగే కొనసాగించండి.

కోచ్​:- థ్యాంక్యూ సర్​. మీ సహకారానికి ధన్యవాదాలు. అమ్మాయిలు దేశ ప్రజల్లో స్ఫూర్తినింపారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.

ఇదీ చూడండి:- 'నవ భారతావనికి ఈ హాకీ వనితలు స్ఫూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.