Tokyo Paralympics: పతక విజేతలకు ప్రభుత్వం భారీ నజరానా

author img

By

Published : Sep 9, 2021, 10:41 PM IST

Govt to give cash award to sportspersons who won medal at Tokyo Paralympics

పారాలింపిక్స్​లో(Tokyo Paralympics 2021) పతక విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ రివార్డును ప్రకటించింది. స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్లకు రూ.10 లక్షలు, రజతానికి రూ.8 లక్షలు, కాంస్యానికి రూ.6 లక్షలను బహుమానంగా(Rewards For Paralympians) ఇవ్వనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics 2021) పతకాలు సాధించిన అథ్లెట్లకు నజరానా ఇవ్వాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బంగారు పతకధారులకు రూ.10 లక్షలు.. రజత, కాంస్య పతక విజేతలకు రూ.8 లక్షలు, రూ.5 లక్షల బహుమానంగా ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించింది.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్​.. పారాలింపిక్స్​లో విజేతలను సత్కరించి.. ఆయా రివార్డులను(Rewards For Paralympians) అందజేయనున్నారు. పతకాలు సాధించిన వారితో పాటు వారి కోచ్​లనూ శుక్రవారం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించనున్నారు.

పారాలింపిక్స్​ చరిత్రలో(India Medals in Paralympics 2021) భారత్​ అత్యధికంగా ఈ సారి 19 పతకాలను సాధించింది. అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యలున్నాయి.

ఇదీ చూడండి.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. భారత సంతతి క్రికెటర్​ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.