Commonwealth games: లాన్‌ బౌల్స్‌ ఆట ఎలా ఆడతారో తెలుసా?

author img

By

Published : Aug 3, 2022, 10:26 AM IST

what is lawn bowls game in Commonwealth games

what is lawn bowls game: కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి గోల్డ్​ మెడల్​ సాధించింది. ఇంతకీ ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా?

what is lawn bowls game: కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి స్వర్ణాన్ని ముద్దాడి చరిత్ర సృష్టించింది. 17-10 తేడాతో విజయం సాధించింది. దీంతో ఇప్పుడందరూ ఈ ఆట గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా..?

లాన్ బౌల్స్ అనేది ఓ ఔట్‌డోర్‌ క్రీడ. దీన్ని లాన్ బౌలింగ్ అని కూడా పిలుస్తారు. 'జాక్' అని పిలిచే చిన్న బంతి వైపు క్రీడాకారులు బౌల్‌ను విసురుతారు. ఈ ఆటను సాధారణంగా 40–42 గజాల ఫ్లాట్‌గా ఉండే గ్రీన్‌లాన్‌లో ఆడతారు. ఈ గేమ్‌లోని ప్రధాన లక్ష్యం క్రీడాకారులు కొంత దూరంలో నిలుచొని తమ బౌల్‌ను ‘జాక్’కు దగ్గరికి వెళ్లే విధంగా రోల్ చేస్తూ విసరాలి. అది వెళ్లి జాక్‌కు అత్యంత సమీపంలో నిలవాలి. అలా ఒక మ్యాచ్‌ పూర్తవ్వాలంటే ఇరు జట్లు 18 మూలల నుంచి బౌల్స్‌ను విసరాలి. అయితే, ఇది పూర్తిగా వృత్తాకార పద్ధతిలో నిర్వహిస్తారు. 18 రౌండ్ల తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఈ లాన్‌బౌల్స్‌ ఈవెంట్‌లో మొత్తం నాలుగు ఫార్మాట్‌లు ఉంటాయి. సింగిల్స్, పెయిర్స్, ట్రిపుల్స్, ఫోర్స్‌. ప్రతి జట్టులోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఆయా ఫార్మాట్లకు ఆ పేరు పెట్టారు.

లాన్ బౌల్స్ నియమాలు..
ఈ గేమ్‌ క్రికెట్‌ మాదిరే టాస్‌తో మొదలవుతుంది. టాస్ గెలిచిన క్రీడాకారులు తొలి అవకాశం తీసుకుంటారు. ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు తొలుత జాక్‌ను 23 మీటర్ల కన్నా ఎక్కువ దూరం రోల్‌ చేయాల్సి ఉంటుంది. ఆ జాక్‌ ఎక్కడైతే నిలుస్తుందో దాన్నే అంతిమ లక్ష్యంగా నిర్దేశిస్తారు. మరోవైపు ఈ రోల్‌తోనే జాక్, గేమ్‌ మొదలెట్టాల్సిన పాయింట్‌ మధ్య ఉన్న దూరాన్ని నిర్ణయిస్తారు. దీంతో క్రీడాకారులు త్రో చేసిన బౌల్స్‌.. జాక్‌కు దగ్గరగా వెళ్లినప్పుడు పాయింట్లు కేటాయిస్తారు. ఈ క్రమంలోనే ఈ క్రీడలో విజయం సాధించాలంటే ఆయా క్రీడాకారులు లేదా బృందాలు.. తమ బౌల్స్‌ను జాక్‌కి అత్యంత సమీపంలోకి (ప్రత్యర్థుల కన్నా) విసిరేలా చూసుకోవాలి. ఇక్కడ ప్రత్యర్థి బౌల్‌ను పక్కకు పడేయడం ద్వారా కూడా పాయింట్లు సాధించవచ్చు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఫోర్స్‌ ఈవెంట్‌లో ప్రతి జట్టు ఒక ఎండ్‌ నుంచి ఎనిమిది త్రోలు విసురుతుంది. అంటే ఒక రౌండ్ పూర్తవతుందన్న మాట. అలాగే వ్యక్తిగత ఈవెంట్‌లో పోటీదారులు ప్రతి ఎండ్‌లో నాలుగు బౌల్స్ చేయాల్సి ఉంటుంది. అదే టీమ్ ఈవెంట్‌లో ప్రతి సభ్యుడు ఒక ఎండ్‌ నుంచి రెండు బౌల్స్‌ చేస్తారు.

పాయింట్లు ఎలా ఇస్తారు?

  • ఒక జట్టు తన ప్రత్యర్థితో పోల్చితే జాక్‌కు దగ్గరగా విసిరిన బౌల్స్ సంఖ్య ఆధారంగా పాయింట్లను నిర్ణయిస్తారు.
  • ఉదాహరణకు: A అనే టీమ్ B టీమ్‌ కన్నా రెండు బౌల్స్‌ను జాక్‌కి దగ్గరగా విసిరినట్లయితే.. A టీమ్‌ చివరికి రెండు పాయింట్లు సాధిస్తుంది.
  • ఒకవేళ B టీమ్ A టీమ్‌ కన్నా మూడు బౌల్స్‌ను లక్ష్యానికి దగ్గరగా విసిరితే.. దానికి మూడు పాయింట్లు కేటాయిస్తారు.
  • అయితే.. ఒకే గేమ్‌లో ఆటగాడు నిర్దేశిత షాట్‌లను (సాధారణంగా 21 లేదా 25) చేరుకున్నప్పుడు ఫలితాన్ని నిర్ణయిస్తారు.
  • కాగా, కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఈసారే పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. 2010, 2014, 2018 సీజన్లలో పాల్గొన్నా.. రెండుసార్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరింది. అంతకుముందు నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

ఇదీచూడండి: ఒకే ఓవర్‌లో 6 6 6 6 4 6.. అదరగొట్టిన జింబాబ్వే బ్యాటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.