నెరవేరిన నీరజ్​ కల.. భావోద్వేగ ట్వీట్​

author img

By

Published : Sep 11, 2021, 1:53 PM IST

neeraj chopra

తన చిరకాల కలను నిజం చేసుకున్నానంటూ ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టాడు స్టార్ జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్డా. తన తల్లిదండ్రులను మొదటిసారి విమానం ఎక్కించిన ఫొటోను షేర్ చేశాడు.

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన జావెలిన్​ స్టార్​ నీరజ్ చోప్డా మరోసారి వార్తల్లో నిలిచాడు. తన తల్లిదండ్రులను విమానం ఎక్కించడం తన కల అని.. శనివారం అది నెరవేరిందని ట్వీట్​ చేశాడు.

  • A small dream of mine came true today as I was able to take my parents on their first flight.

    आज जिंदगी का एक सपना पूरा हुआ जब अपने मां - पापा को पहली बार फ्लाइट पर बैठा पाया। सभी की दुआ और आशिर्वाद के लिए हमेशा आभारी रहूंगा 🙏🏽 pic.twitter.com/Kmn5iRhvUf

    — Neeraj Chopra (@Neeraj_chopra1) September 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేను కన్న ఓ చిన్న కల ఈరోజు నెరవేరింది. మొదటిసారిగా నా తల్లిదండ్రులను విమానం ఎక్కించాను"

--నీరజ్ చోప్డా, జావెలిన్ త్రో క్రీడాకారుడు.

ఒలింపిక్స్​ పతకం గెలిచిన నీరజ్​ చోప్డాకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇన్​స్టా గ్రామ్​లో మరో పోస్ట్ చేశాడు నీరజ్.

ఇదీ చదవండి:పెరిగిన నీరజ్ బ్రాండ్ విలువ.. కోహ్లీకి సమంగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.