India Open 2022: సింధు క్వార్టర్స్​లోకి.. సైనా ఔట్

author img

By

Published : Jan 13, 2022, 3:12 PM IST

sindhu, saina

India Open 2022: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్​కు చేరుకుంది. మరో షట్లర్ సైనా నెహ్వాల్​ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

India Open 2022: ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ నుంచి స్టార్ షటర్ల్ సైనా నెహ్వాల్​ నిష్క్రమించింది. రెండో రౌండ్​లో మాలవిక బన్సోడ్​ చేతిలో సైనా ఓడిపోయింది. దాదాపు ​ 35 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్​లో 21-17, 21-9 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది సైనా.
అంతకుముందు భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు.. క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. ప్రత్యర్థి ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించింది.
ఇక ప్రస్తుతం జరుగుతున్న​ టోర్నీలో భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్పతో పాటు మరో ఐదుగురికి కరోనా సోకినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​) వెల్లడించింది.

ఇదీ చదవండి:

శ్రీకాంత్​ సహా ఏడుగురు భారత ఆటగాళ్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.