మహిళా హాకీ క్రీడాకారిణికి కరోనా.. కొరియాతో మ్యాచ్ రద్దు

author img

By

Published : Dec 8, 2021, 1:55 PM IST

Indian hockey player tests positive, Asian Champions Trophy Hockey. భారత మహిళా హాకీ క్రీడాకారిణికి కరోనా, ఆసియా మహిళల హాకీ ఛాంపియన్ షిప్

Asian Champions Trophy Hockey 2021: మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం భారత్-దక్షిణా కొరియా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భారత జట్టులో ఒకరికి కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్​ను అధికారులు రద్దు చేశారు.

Asian Champions Trophy Hockey 2021: మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో బుధవారం భారత్-దక్షిణా కొరియా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భారత మహిళల జట్టులో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

"రోజువారీ పరీక్షల్లో భాగంగా చేసిన టెస్టుల్లో ఒకరికి పాజిటివ్​గా తేలింది. దీంతో ఈరోజు దక్షిణ కొరియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయిందని తెలపడానికి విచారిస్తున్నాం" అని హాకీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ టోర్నీ తొలి మ్యాచ్​లో థాయ్​లాండ్​ను 13-0 తేడాతో చిత్తు చేసింది భారత జట్టు. మంగళవారం మలేషియాతో జరగాల్సిన మ్యాచ్​ కరోనాతోనే రద్దయింది. మలేషియా జట్టు ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్ జరగలేదు.​

ఇవీ చూడండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లీ, రోహిత్​తో సెలెక్టర్ల మంతనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.