ధోనీ, రొనాల్డో, మెస్సీపై కోహ్లీ వైరల్​​ కామెంట్..!

author img

By

Published : Nov 21, 2022, 3:28 PM IST

Updated : Nov 21, 2022, 3:39 PM IST

virat kohli comment on dhoni

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ప్రారంభమైంది. దిగ్గజ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీలపైనే అభిమానుల దృష్టంతా ఉంది. అయితే తాజాగా వీరిద్దరిపై టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్​ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాటు క్రికెట్​ దిగ్గజం ధోనీపై కూడా ఇంట్రెస్టింగి కామెంట్​ చేశాడు. ఏమన్నాడంటే..?

క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాళ్లు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు ఉన్న సందడే వేరు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 వచ్చేసింది. మెస్సీ, రొనాల్డోలపైనే అందరి దృష్టి. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్పే చివరిదని భావిస్తున్న నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్యే ఫైనల్‌ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్‌ ప్లేయర్లు కలిసి ఫుట్​బాల్​ కాకుండా ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఫిఫా ప్రపంచ కఫ్‌ నేపథ్యంలో ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్‌ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్‌లో రికార్డుల స్టార్​ కింగ్‌ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో చూసి.. 'ఎంత అద్భుత చిత్రమో' అంటూ కామెంట్‌ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతుంది.

ధోనిపై కూడా.. భారత స్టార్​ క్రికెటర్స్​​ ఎంఎస్ ధోనీ, విరాట్​ కోహ్లీ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.​ కోహ్లీ తరుచూ మహీ గొప్పతనం గురించి మాట్లాడుతుంటాడు. తన అభిమానాన్ని చాటుతుంటాడు. అయితే తాజాగా మరోసారి విరాట్​.. ధోనీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. వాటర్​ బాటిల్​పై ఉన్న ధోని ఫొటోను జత చేస్తూ..'అతను ఎక్కడైనా ఉంటాడు. చివరికి వాటర్​ బాటిల్​ పైన కూడా ఉన్నాడు' అని వ్యాఖ్య​ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, టీ20 ప్రపంచ కప్‌ తర్వాత కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి కాస్త విరామం తీసుకుంటున్నాడు.

virat kohli comment on dhoni
ధోనిపై కోహ్లీ ఇంట్రెస్టింగ్​ కామెంట్

ఇదీ చదవండి: సూర్య ఆడిన ఆ షాట్లు నెవ్వర్‌ బిఫోర్‌ అంతే!: కేన్‌ మామ

సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ

Last Updated :Nov 21, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.