రాయుడు ట్వీట్​తో గందరగోళం.. సీఎస్​కే క్లారిటీ

author img

By

Published : May 14, 2022, 5:16 PM IST

Rayudu news

Ambati Rayudu: తనకు ఇదే చివరి ఐపీఎల్​ అని ట్వీట్​ చేసి షాక్ ఇచ్చాడు సీఎస్​కే బ్యాటర్​ అంబటి రాయుడు. అయితే ఆ తర్వాత కాసేపటికే ట్వీట్​ను డిలీట్​ చేశాడు. దీనిపై సీఎస్​కే క్లారిటీ ఇచ్చింది.

Rayudu Retirement: ఆంధ్రా క్రికెటర్‌, చెన్నై టీమ్‌ టాప్‌ కీలక బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు ఒక్క ట్వీట్‌తో అభిమానులకు షాకిచ్చి తర్వాత గందరగోళానికి గురిచేశాడు. దీంతో ఇప్పుడు అతడి పేరు ట్విటర్‌లో మార్మోగుతోంది. ఈ మధ్యాహ్నం రాయుడు ఒక ఆసక్తికర ట్వీట్‌ చేసి వెంటనే దాన్ని తొలగించాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్‌ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా ఈవెంట్‌లో ఆడనని అందులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశాలు ఇచ్చిన ముంబయి, చెన్నై జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. కొద్ది క్షణాల్లోనే ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అయితే కాసేపటికే రాయుడు ఆ ట్వీట్‌ను తన ఖాతా నుంచి తొలగించాడు. దీంతో రాయుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

Rayudu Retirement
రిటైర్​మెంట్​పై రాయుడు షాకింగ్ ట్వీట్​.. సీఎస్​కే క్లారిటీ..

Rayudu Tweet: అయితే రాయుడు డిలీట్‌ చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథ్‌ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. 'నేను అతడితో మాట్లాడాను. రాయుడు రిటైర్‌ అవ్వట్లేదు. ఈ సీజన్‌లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్ల పొరబాటుగా ఆ ట్వీట్‌ చేసి ఉంటాడు. కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్‌ చేశాడు. కచ్చితంగా అతడు రిటైర్‌ అవ్వట్లేదు' అని విశ్వనాథ్‌ మీడియాకు వెల్లడించారు. 2019లో ప్రపంచకప్‌ జట్టుకు రాయుడును ఎంపిక చేయకపోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఇదీ చదవండి: ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ.. మూడో బౌలర్​గా రబాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.