IND VS PAK: పాక్ ఆటగాడికి కెప్టెన్ కోహ్లీ హగ్

author img

By

Published : Oct 25, 2021, 10:10 AM IST

T20 world cup 2021

టీ20 ప్రపంచకప్​లో (T20 world cup 2021 updates) తమ తొలి మ్యాచ్​లో పాక్ విజయం సాధించింది. మహమ్మద్​ రిజ్వాన్(79), బాబార్(68) చెలరేగి ఆడి భారత్​పై గెలిచారు. అయితే.. మ్యాచ్​ అనంతరం క్రీజులో ఉన్న వీరిని భారత జట్టు కెప్టెన్ కోహ్లీ అభినందించాడు.

ఆదివారం జరిగిన భారత్​-పాక్ మ్యాచ్ (india vs pakistan match latest news) అనంతరం క్రీడా స్ఫూర్తిని చాటారు ఆటగాళ్లు. పోరాటమేదైనా ఆటలోనే.. ఒక్కసారి ఆట ముగిశాక అందరం ఒక్కటే అని చాటిచెప్పారు. గెలుపు కోసం చేసే పోరాటంలో భావోద్వేగాలు అక్కడికే పరిమితం, ఆ తర్వాత ప్రత్యర్థి జట్లు స్నేహితులేనన్నట్లు వ్యవహరించారు.

పాక్​కు విజయం వరించాక క్రీజులో ఉన్న రిజ్వాన్​, బాబర్​కు ష్యేక్​హాండ్ ఇచ్చాడు కెప్టెన్ కోహ్లీ. రిజ్వాన్​ను మనస్ఫూర్తిగా అభినందించాడు. ఆడేటప్పుడు మాత్రమే గెలుపోటములు, వ్యూహప్రతివ్యూహాలు.. ఆట ముగిశాక అంతా సోదరభావమే అని తన చేష్టలతో చాటిచెప్పాడు. ఆ దృశ్యాలు ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేశాయి. దీనిపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పాక్​తో జరిగిన మ్యాచ్​లో (T20 world cup 2021 news) కోహ్లీని దురదృష్టం వెంటాడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కి దిగిన విరాట్ సేన.. మొదట్లోనే తప్పటడుగులు వేసింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. క్రీజులోకి దిగిన బాబర్ సేన.. సునాయసంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహమ్మద్​ రిజ్వాన్(79), బాబర్(68) చెలరేగిపోయారు.

ఇదీ చదవండి: జట్టులో నుంచి రోహిత్​ను తప్పించడమా.. కోహ్లీ రియాక్షన్​ ఇది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.