'పంత్​ అతడిలా ఆడితే.. దిల్లీకి మరిన్ని విజయాలు'

author img

By

Published : May 10, 2022, 5:45 PM IST

Updated : May 10, 2022, 10:57 PM IST

Pant

దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్​కు టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. టీ20 ఫార్మాట్​లో 'ఆండ్రీ రస్సెల్'లాగా ఒకే టెంపోలో ఆడాలని చెప్పారు.

ఐపీఎల్ 2022లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్​కు భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. టీ20 ఫార్మాట్​లో 'ఆండ్రీ రస్సెల్' లాంటి ఆటతీరును పంత్​ ప్రదర్శించాలన్నారు ​రవిశాస్త్రి. క్రీజులోకి వెళ్లినప్పటి నుంచి ఒకే ఊపుతో ఉంటే.. దిల్లీకి మరిన్ని విజయాలను అందించగలిగే సత్తా.. పంత్​కు ఉందన్నారు.

పరిమిత ఓవర్ల క్రికెట్​కు రస్సెల్ ఆట బాగా సరిపోతుందని.. అతనిలాగా స్వేచ్ఛగా షాట్లను ఆడటాన్ని అలవర్చుకోవాలన్నారు. బౌలింగ్​ ఎవరు వేస్తున్నారు? ఎలాంటి బంతులను వేస్తున్నారు? అనే విషయాలను పట్టించుకోకుండా.. బంతితో సరిగ్గా కనెక్ట్ అవుతూ.. స్వేచ్ఛగా షాట్లు కొట్టాలని పంత్​కు సూచించారు శాస్త్రి.

ఈ సీజన్​లో ఇప్పటి వరకు దిల్లీ క్యాపిటల్స్‌ 11 మ్యాచ్​లు ఆడగా.. ఐదు మ్యాచ్​లు గెలిచింది. ఆ మ్యాచ్​ల్లో పంత్​ మొత్తం 281 పరుగులు చేయగా.. 152.71 స్ట్రైక్​తో ఉన్నాడు. దిల్లీ టీమ్​ 10 పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌తో మిగిలిన మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

Last Updated :May 10, 2022, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.