Ipl 2021: టాస్​ గెలిచిన సీఎస్కే.. రోహిత్​ లేకుండానే ముంబయి

author img

By

Published : Sep 19, 2021, 7:03 PM IST

Updated : Sep 19, 2021, 7:22 PM IST

ipl second phase

మరి కాసేపట్లో ప్రారంభంకానున్న ఐపీఎల్​ రెండో దశ(ipl second phase) తొలి మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది సీఎస్కే. సారథి రోహిత్​ శర్మ లేకుండానే బరిలో దిగనుంది ముంబయి ఇండియన్స్​.

ప్రేక్షకులను అలరించేందుకు మరి కాసేపట్లో ఐపీఎల్​ రెండో దశ(ipl second phase) ప్రారంభంకానుంది. దుబాయ్​ వేదికగా రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్‌, ఎం.ఎస్‌.ధోనీ కెప్టెన్‌గా(csk vs mumbai ipl 2021) ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) జట్ల మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది సీఎస్కే. అయితే ఈ మ్యాచ్​కు ముంబయి సారథి హిట్​మ్యాన్​ దూరమయ్యాడు. పొలార్డ్​ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక ఈ జట్టు తరఫున అన్​మోల్​ప్రీత్​ సింగ్ ఐపీఎల్​ అరంగేట్రం చేయనున్నాడు.

రెండు బలమైన జట్లే కావడం వల్ల ఏ జట్టు విజేతగా నిలుస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఇరు జట్లు 31 మ్యాచ్​ల్లో తలపడగా.. అందులో సీఎస్కే 12 గెలవగా.. ముంబయి 19 మ్యాచ్​ల్లో విజయం సాధించింది.

జట్లు:

ముంబయి ఇండియన్స్: క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అన్​మోల్​ప్రీత్​ సింగ్, కిరన్ పొలార్డ్ (సి), సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్య, అడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

చెన్నై సూపర్​ కింగ్స్​: డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హెజెల్‌వుడ్

ఇదీ చూడండి: IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం: కోహ్లీ

Last Updated :Sep 19, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.